హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీవర్షాలపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయని ఆయన ఆకాంక్షించారు. ”తెలంగాణలో భారీవర్షాలు, వరదలు తగ్గుమఖం పట్టాలని.. నష్టం జరగకూడదని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ గొప్పగా పని చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని అభ్యర్థిస్తున్నా” అని యువరాజ్ సింగ్ గురువారం మధ్యాహ్నం ట్వీట్ చేశాడు. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత రెండు రోజుల నుంచి అధికారులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.
I pray the heavy downpour & water logging in Telangana eases soon & there is no more damage. The frontline workers are doing their best to bring relief to affected areas. I pray for those who lost their life & for the affected families. Requesting everyone to please stay safe 🙏🏻
— Yuvraj Singh (@YUVSTRONG12) October 15, 2020