- Advertisement -
మనతెలంగాణ, స్కోర్ : ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ గతేడాది క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యువీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. యువరాజ్ తిరిగి క్రికెట్ ఆడనున్నాడు. వచ్చే నెల ప్రారంభం కానున్న దేశవాళీ ముస్తాక్ అలీ టి20 ట్రోపీలో అలరించడానికి సిద్దమవుతున్నాడు. 2019లో యువీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పునీత్ సంప్రదించడంతో తన సొంత రాష్ట్రం కోసం తిరిగి ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దేశవాళీ టి20 ట్రోఫికి పంజాబ్ జట్టులోని 30 మంది ప్రాబబుల్ ఆటగాళ్ల జాబితాలో యువీ పేరు నమోదైంది. ఈ విషయాన్ని యువీ తన అభిమానులకు వెల్లడించాడు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్నానని ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పంచుకున్నాడు.
- Advertisement -