Friday, March 29, 2024

మాజీ ఎంఎల్‌ఏ చెంగల్ బాగన్న మృతి

- Advertisement -
- Advertisement -
Zaheerabad Former MLA Chengal Baganna No More
సంతాపం ప్రకటించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : జహీరాబాద్ మాజీ ఎంఎల్‌ఏ చెంగల్ బాగన్నఅనారోగ్యంతో మృతి చెందారు. గత నెల రోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి లో చేరారు. అయితే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ని తెలిపారు. ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన చెంగల్ బాగన్న నేటిత రం నాయకులకు ఆదర్శప్రాయుడని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా బాగన్న 1994లో టిడిపి నుంచి తొలిసారి ఎంఎల్‌ఏ ఎన్నికై 1999 వరకు జహీరాబాద్ శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చిన మార్పు ల్లో భాగంగా ఆయన సన్నిహితుల సూచన మేరకు బిజేపిలో చేరారు. తర్వాత కొద్ది కాలంలోనే రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన మరణంతో నియోజకవర్గంలో విషాదచాయలు అలముకున్నాయి.

Zaheerabad Former MLA Chengal Baganna No More

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News