- Advertisement -
ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియంత్రణ రేఖ(ఎల్ఓసి) వెంబడి పాకిస్తాన్ సైనికులు పది రోజులుగా కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో ఎయిర్ చీఫ్ ప్రధానితో భేటీ కావడం ప్రధాన్యత సంతరించుకుంది. ప్రధానితో దాదాపు 40 నిమిషాల పాటు ఎ.పి సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బార్డర్ లో పరిస్థితులతో పాటు పలు అంశాలపై ఆయన ప్రధాని మోడీ చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి శనివారం ప్రధానిని కలిసి అరేబియా సముద్రంలోని క్లిష్టమైన సముద్ర మార్గాలలో మొత్తం పరిస్థితిని ప్రధానికి వివరించారు.
- Advertisement -