Saturday, July 27, 2024

మీ శ్రమ వృథా కాలేదు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో పార్టీకి సహకరించిన కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు
పిసిసి చీఫ్ రేవంత్ ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రే యోభిలాషులు ప్రతి ఒక్కరికీ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీ రంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. మీ కష్టం, మీ శ్రమ వృధా కాలేదు, తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది అంటూ అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మీ క ష్టం, మీ శ్రమ వృథా కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News