Thursday, September 18, 2025

లోయలో టెంపో పడి 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం 11.30 గంటలకు 23 మంది ప్రయాణికులతో రుద్రప్రయాగ్ వైపు వెళ్తున్న టెంపో అదుపు తప్పి లోయలో పడిపోయింది. దాదాపు 150200 మీటర్ల లోతులో ఉన్న లోయలో టెంపో పడడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రైటోలి సమీపంలో రిషికేశ్‌బద్రీనాథ్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోయలోని అలసంద నదిలో వాహనం పడినట్టు తెలుస్తోంది. సహాయ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను ప్రారంభించాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఈ సంఘటనకు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలోకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News