మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి బుధవారం రవీంద్రభారతిలో విడుదల చేశారు. 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరిగిన పది పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడింగ్
పదో తరగతిలో ఈసారి కొత్తగా సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడింగ్ కూడా ఇచ్చారు. ఈ విధనంగా మార్కుల మెమోలు జారీ చేయనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ పొందుపరిచారు విద్యార్థి పాసయ్యారా..? ఫెయిల్ అయ్యారా…? అనేది మాత్రమే ఫలితాలలో కనిపిస్తుంది. ఇంకా బోధనేతర కార్యక్రమాల (కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు.
సిబిఎస్ఇ తరహాలో మెమోలు
ప్రస్తుతం సిబిఎస్ఇలో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రిస్తున్నారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రించారు.