Sunday, June 1, 2025

నైజీరియాలో వరదలకు మార్కెట్‌టౌన్ మునిగి 111 మంది మృతి

- Advertisement -
- Advertisement -

నైజీరియా లోని నైజెర్ రాష్ట్రంలో మార్కెట్ టౌన్ మోక్వాలో వరదలు ముంచెత్తి 111 మంది ప్రాణాలు కోల్పోయారు. నైజెర్ రాష్ట్ర రాజధాని మిన్నాలో ఆపరేషన్స్ ఆఫీస్ హెడ్ హుస్సేన్ ఇసా వరద ముప్పులో ఇంకా అనేక మంది చిక్కుకున్నారని వారిని రక్షించే చర్యలు చేపట్టామని తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. గత కొన్ని గంటలుగా ఎడతెరిపిలేని వానలు కురియంతో వరదలు ముంచుకొచ్చాయి. సమీపాన గల ఆనకట్ట కూలిపోవడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దక్షిణాది వ్యాపారస్తులకు, ఉత్తరాది రైతులకు మోక్వా నగరం కేంద్రంగా ఉంటోంది. గత సెప్టెంబరులో నైజీరియా ఈశాన్య ప్రాంతం మైదుగురిలో కుంభవృష్టి కారణంగానే సమీపాన ఆనకట్ట కూలిపోయి 30 మంది మృతి చెందారు. కొన్ని వేల మంది నిర్వాసితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News