Friday, June 6, 2025

57 మంది రైతులపై కేసులు

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం, పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో 35 ఎకరాల్లో గాయత్రి ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన కేసులో 57 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. అందులో 12 మంది రైతులను గురువారం రిమాండ్‌కు తరలించగా 40 మంది రైతులు పరారీలో ఉన్నారని, 5 మందికి నోటీసులు ఇవ్వడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం దగ్గర 12 గ్రామాల రైతులు కంపెనీ నిర్మాణం చేపట్టే ప్రదేశంలో భారీ వాహనాలను, యంత్ర సామాగ్రిని, కూలీల పూరి గుడిసెలు, కంటైనర్లను తగులబెట్టి సుమారు రూ 40 లక్షల ఆస్తిని నష్టపరిచినట్లు యజమాని మంజునాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికి 57 మందిపై కేసు నమోదు చేయగా 12 మందిని గురువారం అరెస్ట్ చేసి గద్వాల కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.తెలంగాణ రాష్ట్రంలో నేటికి ఆంధ్ర పెత్తనం ఇంకా పోలేదనడానికి ఈ సంఘటనే నిదర్శనమని, పచ్చని పొలాలో చిత్తూరు జిల్లా మదనపల్లి టౌన్‌కు చెందిన కంపెనీ

నిర్వాహకుడు మంజునాథ్ ఇథనాల్ కంపెనీ తెచ్చిన మంట 12 మంది గ్రామాల రైతులు పిల్ల, జల్ల, గూడు విడిసిన పక్షులా బతుకులు ఛిద్రమయ్యాయి. ఈ దుస్థితికి తెచ్చిన యజమానిపై గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇథనాల్ కంపెనీ వద్దని పలుసార్లు జిల్లా కలెక్టర్‌కు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా మాపై, మా 12 గ్రామాల రైతులపై చిత్తశుద్ధి లేకుండా కంపెనీకి వత్తాసు పలికే అధికారులు, నాయకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో 40 మంది రైతులపై కేసులు నమోదు కాగా గురువారం గద్వాల కోర్టులో హాజరు పరచి 12 మంది చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ గ్రామాలకు చెందిన జయరాం రెడ్డి, రెహమాన్, నాగరాజు, కురువ చెన్నయ్య, డీలర్ నాగరాజు, నరసింహ, కురువ నారాయణ, కురువ శివన్న, కొంకల నరసింహ, కెఎంఎస్ శ్రావణ్, వీరన్న, రాజేంద్ర ప్రసాద్ అ నే రైతులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News