టివి న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో అరెస్టైన పూర్ణ చందర్ నాయక్కు కోర్టు ఆదివారం 14 రోజుల రిమాండ్ విధించింది. ఓ న్యూస్ ఛానల్లో న్యూ రీడర్, యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల నుంచి స్వేచ్ఛ, పూర్ణచందర్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి తనను వివాహాం చేసుకోవాలని స్వేచ్ఛ కోరుతున్నా పూర్ణచందర్ దాటవేస్తు వస్తున్నాడు. ఇటీవల కాలంలో స్వేచ్ఛ గట్టిగా నిలదీయడంతో వివాహం చేసుకునేందుకు పూర్ణచందర్ నిరాకరించాడు. దీంతో మనస్థపం చెందిన స్వేచ్ఛ సూసైడ్ నోట్ రాసి, పూర్ణ చందర్తో తను ఉండడలేనని తల్లిదండ్రులకు చెప్పింది.
తర్వాత ఉరివేసుకుని ఆత్మహ్యత చేసుకుంది. స్వేచ్ఛ తల్లిదండ్రులు పూర్ణ చందర్ వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు స్వేచ్ఛ కూతురు కూడా తన పట్ల పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించాడని చిక్కడ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్ 69,108 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పూర్ణచందర్ రావు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో కోర్టులో హాజరుపర్చారు. నిందితుడికి రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిక్కడపల్లి ఎసిపి రమేష్ కుమార్ తెలిపారు.