Tuesday, June 10, 2025

రోడ్డు ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తర మలేసియాలో యూనివర్శిటీ విద్యార్థులను క్యాంపస్‌కు తీసుకెళ్తున్న బస్సు ఓ మినీ వ్యాన్‌ను ఢీకొట్టడంతో 15 మంది విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఉత్తరమలేసియా లోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషనల్ యూనివర్శిటీకి చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తుండగా, అదుపు తప్పి ముందు వెళ్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో 13 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సహాయక బృందాలు వెంటనే అక్కడకు వెళ్లి 30 మందికి పైగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థలు మరణించారు. ప్రస్తుతం ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో అందరూ 21 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. మలేసియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని ఉన్నత విద్యామంత్రిత్వశాఖను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News