Monday, June 2, 2025

వర్షం బీభత్సం..నేల కూలిన 150 ఏళ్ల మర్రి వృక్షం

- Advertisement -
- Advertisement -

మహబూబాద్ జిల్లా బయ్యారం మండలంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఈదురుగాలతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు రెండు గంటల పాటు వడగల్లు ఈదురుగాలతో వర్షం కురవడంతో అనేక గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు, రేకులు గాలికి కొట్టుకుపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొత్తపేట బయ్యారం బాలాజీపేట వెంకట్రాంపురం, జగ్గు తండా, నామాలపాడు, బంజర తండా, మిర్యాల పెంట, కంబాలపల్లి కాచినపల్లి, నర్సాతండా ఉప్పలపాడు గ్రామాల్లో వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మహబూబాబాద్ నుండి ఇల్లందుకు వెళ్లే ప్రధాన రహదారిలో రంగాపురం గ్రామ దేవత గుడి వద్ద సుమారు 150 ఏళ్ల వయస్సు ఉన్న భారీ మర్రిచెట్టు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం నెలకొంది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిచి నీటి ప్రవాహ దాటికి కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News