అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఇరాన్ తమ గగనతలాన్ని శుక్రవారం మూసివేసింది.ఈ పరిణామాలతో ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ130ను అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. లండన్ హీత్రూముంబై విమానం వియన్నాకు మళ్లించారు. ఎఐ102న్యూయార్క్ ఢిల్లీ విమానాన్ని షార్జాకు, ఏఐ116 న్యూయార్క్ ముంబై విమానం జెడ్డాకు మళ్లించారు. ఎఐ2018 లండన్ హీత్రూ ఢిల్లీ విమానం ముంబైకి,
ఏఐ 129 ముంబైలండన్హీత్రూ విమానం,ఏఐ 119ముంబైన్యూయార్క్ తిరిగి ముంబైకి రప్పించారు. ఏఐ 103ఢిల్లీ నుంచి వాషింగ్టన్కు వెళ్లవలసిన విమానాన్ని తిరిగి డిల్లీకి రప్పించారు.ఏఐ 106 న్యూయార్క్ ఢిల్లీ విమానాన్ని వియన్నాకు మళ్లించారు. అలాగే మొత్తం 16 విమానాలను ఎయిర్ ఇండియా దారి మళ్లించడమో, వెనక్కి పిలిపించడమో చేసినట్టు సమాచారం. ఇరాన్తోపాటు సమీప రీజియన్ల గగనతలం మూసివేయడంతో కొన్ని విమానాల రూట్లు సుదీర్ఘ దూర ప్రయాణం కానున్నాయని, కొన్ని రద్దు కావడం జరుగుతుందని ఇండిగో విమాన సంస్థ ఎక్స్లో వెల్లడించింది.