Friday, March 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

164 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,242 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 164 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,72,987కు పెరిగింది. తాజాగా 171 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,65,272 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,969కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.85 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,746 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News