- Advertisement -
హైదరాబాద్: విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన సిటిలోని ఎల్బీనగర్ లో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఎల్బీ నగర్-సాగర్ రింగ్ రోడ్డులోని చింతల్ కుంటలో హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఇద్దరిపై ఈ తీగలు పడటంతో మంటలు చెలరేగాయి. ఇద్దరూ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే ఇద్దరు మంటల్లో కాలిపోయి చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరణించినవారిని ఇంకా గుర్తించలేదు. మృతులను పోలీసులు యాచకులుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -