Friday, July 4, 2025

ఎయిర్‌పోర్టులో 3.5కిలోల బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి మస్కట్ మీదుగా హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుని వద్ద 3.5 కిలోల 30 బంగారం బిస్కెట్లు అధికారులు గుర్తించారు. డిఆర్‌ఐ, హెచ్‌జడ్‌యు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… దుబాయ్ నుండి మస్కట్ మీదుగా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ భారతీయుడు అక్రమంగా 30 బంగారం బిస్కెట్లు ప్యాకింగ్ చేసుకుని మూడు ప్యాంట్ జేబుల్లో దాచుకున్నాడు. బంగారాన్ని విమానాశ్రయంలోని అంతర్జాతీయ ప్యాసింజర్స్ అరైవల్ గేటు ఏరోబ్రిడ్జ్ వద్ద ఉన్న గ్రౌండ్ హ్యాండిలింగ్ సిబ్బందికి అందిస్తుండగా డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు.

అయితే నిందితుడు బంగారాన్ని మొదటగా అంతర్జాతీయ ప్యాసింజర్స్ అరైవల్ వద్ద గ్రౌండ్ హాండ్లింగ్ సిబ్బందికి చేరవేసి కస్టమ్స్ అధికారులను తప్పించుకొని బయట పార్కింగ్ వద్ద వేచి ఉన్న రెండవ గ్రౌండ్ సిబ్బందికి ఇస్తాడు. అక్కడి నుంచి ఎవరైతే దుబాయ్ నుండి బంగారాన్ని తరలించారు. తిరిగి పార్కింగ్ వద్ద తీసుకున్న వ్యక్తి ఇతనికి అందజేస్తాడు. అయితే ఈ క్రమంలో ముందుగానే పసిగట్టిన డిఆర్‌ఐ అధికారులు విమానాశ్రయంలోని పార్కింగ్ వద్ద బంగారాన్ని మార్చుకుంటూ ఉండగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ప్యాకింగ్ చేయబడ్డ 30 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.3,45,79,300 కోట్లు ఉంటుందని డిఆర్‌ఐ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News