Wednesday, June 11, 2025

శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీకాకుళం జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్తురాళ్లపాడు వద్ద కోటబొమ్మాళి-శ్రీకాకుళం మార్గంలో జాతీయరహదారిపై దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓడిశాకు చెందిన కొందరు సింహాచలం వెళ్తుండగా.. కాలకృత్యాల కోసం ఎత్తురాళ్లపాడు వద్ద హైవేపై కారు నుంచి దిగిన ముగ్గురిని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వెంటనే చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News