Thursday, September 18, 2025

బైక్, ట్రాక్టర్ ఢీ… ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట వద్ద ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన బైక్, ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనాస్థలంలో ఒకరు మృతి చెందగా, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. చనిపోయినవారిని రామంచకు చెందిన అర్వింద్, అంజి, సంపత్ లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News