Monday, June 9, 2025

కొలువుదీరిన కొత్త మంత్రులు

- Advertisement -
- Advertisement -

హాజరైన సిఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్
కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా, మంత్రులు,
పలువురు ఎంఎల్‌ఎలు విస్తరణలో మాల,
మాదిగ, బిసి వర్గాలకు చోటు నూతన
మంత్రులు ముగ్గురూ అసెంబ్లీలో
తొలిసారి అడుగుపెట్టిన వారే
నేడు శాఖల కేటాయింపు?
వివేక్‌కు విద్యాశాఖ, శ్రీహరి,
లక్ష్మణ్ కుమార్‌లకు బిసి, ఎస్‌సి
సంక్షేమ శాఖలు అప్పగించే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగింది. ఆదివారం రాజ్‌భవన్‌లో నూత న మంత్రులుగా జి.వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, శా సన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్ఠానం సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని నూతన మంత్రులను ఎంపిక చేసింది. దీనిలో భాగంగా నే ఎస్సీల నుంచి వివేక్ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (మాదిగ), బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్‌కు అవకాశం కల్పించారు. కాగా ఈ సారి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది.

కొత్త మంత్రులతో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రునాయక్‌ను అ ధిష్టానం ఎంపిక చేసింది. మంత్రి వర్గ విస్తరణలో కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను అనుసరించింది. కొత్తగా ముగ్గురికి మంత్రివర్గంలో స్థా నం కల్పించారు. ఎస్పీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్ కులం నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చా రు. కాంగ్రెస్ నుంచి 15మంది ఎస్సి ఎమ్మెల్యేలు విజయం సాధించగా కొత్తగా అవకాశంఇచ్చిన వారితో కలుపుకుని నలుగురు ఉన్నారు. ఇప్పటికే మాల కమ్యూనిటీ నుంచి భట్టి విక్రమార్క, మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ ఉండగా కొత్తగా వివేక్ వెంకటస్వామి (మాల) అ డ్లూరి లక్ష్మణ్‌కు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నుం చి ఏడుగురు బీసీ ఎమ్మెల్యేలు గెలవగా ప్రస్తుతం ఇద్దరు బీసీ మంత్రులుగా ఉన్నారు. కొత్తగా ముదిరాజ్ వర్గానికి చెం దిన వాకిటి శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు కల్పించడంలో బిసిల సంఖ్య మూడుకు చేరింది. ఎస్టిల విషయానికొస్తే ఇప్పటి ఆదివాసీల సామాజిక వర్గానికి చెందిన సీతక్క మంత్రిగా కొనసాగుతున్నారు. లంబాడీల కు అవకాశం కల్పించకపోవడంతో వారిని సంతృ ప్తి పరిచే విధంగా రామచంద్రు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇవ్వనున్నారు. కొత్తగా మంత్రిగా విస్తరణలో రెడ్డి కమ్యూనిటీకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు.

కొత్త మంత్రులకు నేడు శాఖల కేటాయింపు
మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చ జోరందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలే వీరికి కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా గడ్డం వివేక్ వెంకటస్వామికి విద్యాశాఖ, వాకిటి శ్రీహరికి బీసీ సంక్షేమ శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు సాంఘీక సంక్షేమ శాఖ ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్య, మైనారిటీ శాఖలు ఉన్నాయి. అయితే వీటిలో ఏవి ఎవరికి ఇవ్వనున్నారనే విషయం సోమవారం తేలనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News