- Advertisement -
ముంబై నుంచి అహ్మదాబాద్కు బుల్లెట్ ట్రెయిన్ 300 కిమీ. వంతెన పూర్తయిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్(ఎఫ్ఎస్ఎల్ఎం) పద్ధతిలో నిర్మించిన ఉపరినిర్మాణము(సూపర్స్ట్రక్చర్) వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. 508 కిమీ. ఈ ప్రాజెక్టును ద నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్) నిర్వహిస్తోంది. గుజరాత్లోని సూరత్ వద్ద 40 మీటర్ల పొడవు బారుదూలము(గిర్డర్) ఆవిష్కరణతో 300 కిమీ. వంతెన పూర్తయింది. సాంప్రదాయిక పద్ధతిలో కంటే పదిరెట్లు వేగంగా పనులు సాగుతున్నాయి. బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులో 383 కిమీ. పలకల వంతెన(పియర్ వర్క్), 401 కిమీ. బారుదూలము పోత(గిర్డర్ క్యాస్టింగ్) పని కూడా పూర్తయిపోయింది.
- Advertisement -