మరో ముగ్గురు నాన్క్యాడర్ అధికారులకూ స్థానచలనం సీనియర్ ఐఎఎస్లకు కీలక
శాఖలు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా లోకేష్కుమార్ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిగా
నవీన్మిట్టల్ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ స్కూల్ ఎడ్యుకేషన్
డైరెక్టర్గా నవీన్ నికోలస్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా రాజీవ్గాంధీ హన్మంత్
సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్గా చెక్క ప్రియాంక సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఒకేసారి ఏకంగా 36 మంది ఐఏఎస్లు, (3 నాన్ కేడర్) అధికారులను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వంలోని కీలక శాఖలను సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలను అప్పగి స్తూ బదిలీ చేసింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 16 నె లలు కావడంతో పూర్తిస్థాయిలో ప్రక్షాళన కార్య క్ర మం చేపట్టింది. గత ప్రభుత్వం నుంచి ఒకే డిపార్ట్మెంట్లో కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ల నుంచి ఆ శాఖలను తొలగించి వేరే శాఖలకు బదిలీ చేసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొ ని ఈ ప్రక్షాళన చేపట్టినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నవీన్మిట్టల్ను ఇందనశాఖ ము ఖ్య కార్యదర్శిగా, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గా ఉన్న లోకేష్కుమార్ను రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎన్. శ్రీ ధర్కు అదనంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కా ర్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.
సిపిఆర్ఓగా జి.మల్సూర్ నియామకం
స్పెషల్ కమిషనర్గా చెక్క ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిపిఆర్గా (గ్రూప్ 1 అధికారి)గా పనిచేసిన జి.మల్సూర్ను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, సంగారెడ్డి, హన్మకొండ, నిజామాబాద్ కలెక్టర్లను మారుస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సీ అభివృద్ధి కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాశ్
రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా లోకేష్కుమార్, ఇందనశాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్మిట్టల్, ఎస్సీ అభివృద్ధి కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాశ్, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్గోయల్, పంచాయతీరాజ్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సమన్వయ కర్తగా గౌరవ్ ఉప్పల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా రాజీవ్గాంధీ హన్మంత్, సమాచార హక్కు చట్టం కమిషన్ కార్యదర్శిగా బి.భారతి లక్పతి నాయక్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్గా కిల్లు శివకుమార్ నాయుడు, సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి, వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా, విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా ఎల్.శివశంకర్కు అదనపు బాధ్యతలు, గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా విపి గౌతమ్కు అదనపు బాధ్యతలు, సింగరేణి డైరెక్టర్గా పొట్రు గౌతమ్, మత్యశాఖ డైరెక్టర్గా కె.నిఖిల,
పర్యాటక శాఖ ఎండిగా వల్లూరు క్రాంతి, ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్టు సిఈఓగా పి.ఉదయ్కుమార్, టిజిపిఎస్సీ కార్యదర్శిగా ప్రియాంక ఆల, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా నవీన్ నికోలస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా శ్రీజన, పిడి, ఎయిడ్స్ కంట్రోల్ డైరెక్టర్గా వాసం వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ మానవహక్కుల కమిషన్ సిఈఓగా నిర్మలా కాంతివెస్లీ, సివిల్ సప్లయ్ ముజుమల్ ఖాన్, సమాచార పౌరసంబందాల శాఖ కమిషనర్గా చెక్క ప్రియాంక, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీగా షఫీయుల్లా, హెచ్ఎండిఏ అర్భన్ ఫారెస్ట్రీ డైరెక్టర్గా (హెచ్ఎండిఏ)కు విఎస్ఎన్వి ప్రసాద్ (ఐఎఫ్ఎస్), పరిశ్రమల శాఖ డైరెక్టర్గా నిఖీల్ చక్రవర్తి (ఐఏఏ అండ్ ఎస్) రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఎండిగా జే.శంకరయ్య (నాన్ క్యాడర్), ఆయూష్ డైరెక్టర్గా పి.శ్రీకాంత్బాబు (నాన్ క్యాడర్), టిజిఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్కుమార్ (నాన్ క్యాడర్), సిఎం సిపిఆర్ఓగా జి.మల్సూర్ (రిటైర్డ్ గ్రూప్ 1) లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచందన
హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచందన, నిజామాబాద్ కలెక్టర్గా టి.వినయ్ కృష్ణారెడ్డి, సిద్ధిపేట కలెక్టర్గా కె.హైమావతి, సంగారెడ్డి కలెక్టర్గా పి.ప్రావీణ్య, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి, హన్మకొండ కలెక్టర్గా స్నేహ శబరీష్, ఖమ్మం కలెక్టర్గా దురిశెట్టి అనుదీప్, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా ప్రపూల్ దేశాయ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చాహాట్ బాజ్పేయిలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.