Saturday, June 21, 2025

పశ్చిమ నైజర్‌లో తిరుగుబాటుదారుల దాడికి 34 మంది సైనికుల బలి

- Advertisement -
- Advertisement -

పశ్చిమ నైజర్‌లో మాలి, బుర్కిన ఫాసో దేశాల సరిహద్దు సమీపాన గురువారం సాయుధులైన తిరుగుబాటుదారులు 34 మంది సైనికులని హత్య చేయగా, 14మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బనిబంగో వద్ద ఈ దాడి జరిగింది. ఎనిమిదికార్లు, 200 మోటారు బైక్‌లపై వచ్చి దాడి చేశారని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దాడికి పాల్పడిన వారు ఉగ్రవాదులని, భద్రతాబలగాలు వారిలో కొందరిని మట్టుబెట్టాయని , మరికొంతమంది దుండగుల కోసం భూమార్గాలు, గగనతల మార్గాల ద్వారా గాలిస్తున్నామని చెప్పింది. నైజర్‌తోపాటు పొరుగున ఉన్న బుర్కినా ఫాసో, మాలి దేశాలు గత దశాబ్ద కాలంగా జిహాదీ గ్రూపుల తిరుగుబాటు దాడులతో సతమతమవుతున్నాయి.

ఈ తిరుగుబాటు వర్గాల్లో కొన్నిటికి, అల్ కైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపులతో సంబంధం ఉంది. ఇటీవల కాలంలో సైనిక తిరుగుబాటు జరగడంతో పాలక జుంటాలు ఫెంచి బలగాలను వెళ్లగొట్టి, భద్రతా సహకారం కోసం రష్యా నుంచి కిరాయి సైనికులను తెచ్చుకున్నారు. సహేల్ రాష్ట్రాల కూటమి పేరుతో నూతన భద్రతా కూటమిని ఏర్పాటు చేసుకుని మూడు దేశాలూ తమ సహకారాన్ని మరింత పటిష్టం చేసుకున్నాయి. జుంటాలు అధికారం చేపట్టాక సహారా ఎడారిలో విస్తారమైన ప్రాంతం సహేల్‌లో భద్రతా పరిస్థితి మరీ అధ్వాన్నమైంది. రికార్డు సంఖ్యలో దాడులు కొనసాగడంతోపాటు ఇస్లామిక్ మిలిటెంట్లతోపాటు ప్రభుత్వ బలగాల దాడుల్లో కూడా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News