- Advertisement -
మణిపూర్ చురాచాంద్ జిల్లా మాంగ్జంగ్ గ్రామంలో సోమవారం గుర్తు తెలియని దుండగులు కారుపై కాల్పులు జరపడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు చెప్పారు. చురాచాంద్పూర్ పట్టణానికి ఏడు కిమీ దూరంలో మాంగ్జంగ్ గ్రామం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. మృతులు థెంఖోథాంగ్ హావోకిప్ అలియాస్ థాపి (48), సెయిఖోగిన్ (34)లెంగౌహావో (35), ఫల్హింగ్ (72) గా గుర్తించారు. సంఘటన ప్రదేశం నుంచి 12 ఖాళీ తూటాలను సేకరించారు. ఈ దాడికి బాధ్యులమంటూ ఇంతవరకు ఎవరూ వెల్లడించలేదు. పోలీసులు, అదనపు భద్రతా బలగాలు ఆ ప్రదేశానికి వెళ్లి దర్యాప్తు చేపట్టాయి.
- Advertisement -