రాష్ట్రంలో 44 మంది డిఎస్పీ(సివిల్)లను బదిలీచేస్తూ డిజిపి జితేందర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. డిఎస్పీ పోస్టింగ్లలో జిహెచ్ఎంసి, హైడ్రా, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. వై.నాగేశ్వరరావుకు సిసిఎస్ సైబరాబాద్, ఆకుల చంద్రశేఖర్కు మహేశ్వరం (ట్రాఫిక్),కె.చంద్రశేఖర్రెడ్డికి మాధాపూర్(ట్రాఫిక్), వై.నర్సిహ్మారెడ్డిని జిహెచ్ఎంసి, పి.సత్తయ్యను రాచకొండ ఎస్ఒటి, జి.రణవీర్రెడ్డికి హైదరాబాద్ సిటి స్పెషల్ బ్రాంచ్, జి.విజయ్కుమార్కు యాదగిరిగుట్ట, ఎ.శ్రీనివాస్కు హైదరాబాద్ ఈస్ట్ జోన్(ట్రాఫిక్), ఎస్.సంపత్కుమార్కు రాచకొండ కమాండ్ కంట్రోల్, పి.రమేష్కుమార్కు ఆంటినార్కోటిక్ బ్యూరో, కె.శంకరయ్యకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, కె.రాంమోహన్ రెడ్డిని హెచ్ఎండిఏకు, ఎ.రవీందర్ రెడ్డిని సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ లతో పాలు పలువురికి స్థానచలనం కల్పించి కొత్త పోస్టింగ్స్ ఇచ్చారు.
రాష్ట్రంలో 44 మంది డిఎస్పీల బదిలీలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -