Wednesday, June 18, 2025

కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం..48 మంది మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్ అదుపు తప్పి ఇతర వాహనాలను ఢీకొని నడుచుకుంటూ వెళ్లే వారి మీదకి దూసుకెళ్లింది. ఈ ఘటన కెన్యాలోని లొండియాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకంది. ఈ ప్రమాదంలో మొత్తం 48 మంది మరణించగా, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు విలియం రూటో మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News