Sunday, June 29, 2025

ఆశ్రితుల స్టేడియంపై దాడులు ..రక్తసిక్త గాజాలో 49 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గాజా తిరిగి రక్తసిక్తం అయింది. ఇజ్రాయెల్ శనివారం జరిపిన దాడులలో కనీసం 49 మంది చనిపోయారు. ఓ వైపు కాల్పుల విరమణ యత్నాలు కొలిక్కి వస్తున్న దశలోనే ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం అయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఇజ్రాయెల్ దాడులు సాగాయి. ఇప్పటికే దాడులతో తల్లడిల్లుతున్న గాజాలో పాలస్తీనియన్లు దెబ్బమీద దెబ్బలతో అమానవీయ స్థితిలో గడపాల్సి వస్తోంది. ఆకలి బాధలు మిక్కుటం అయ్యాయి. పలు ప్రాంతాలలో పసివారు మైళ్ల దూరం నడిచి బన్నుల ప్యాకెట్ల కోసం వెళ్లాల్సి వస్తోంది.

అనేక చోట్ల అన్నార్థులు, దాహార్తుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి . ఈ దశలోనే తిరిగి దాడులు జరిగాయని ఇక్కడి ఆరోగ్య శాఖ సిబ్బంది తెలిపింది. గాయపడి చికిత్సకు వస్తున్న వారితో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. గాజా స్టేడియం వద్ద జరిగిన దాడులల కనీసం 12 మంది మృతి చెందారు. నిర్వాసితుల ఆశ్రయ కేంద్రంగా ఉన్న ఈ స్టేడియంపై బాంబుల వర్షం కురిపించారని స్థానిక అధికారులు తెలిపారు. షిఫా ఆసుపత్రి పరిసరాల్లో హృదయవిదారక దృశ్యాలు నెలకొన్నాయి. వచ్చే వారంలోనే గాజా పూర్తి స్థాయిలో శాంతిస్తుందని, ఇరుపక్షాల మధ్య కవ్వింపు చర్యలు నిలిచిపోతాయని ఇటీవలే ట్రంప్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News