Thursday, June 5, 2025

తుర్కియే తీరంలో 5.8 తీవ్రతతో భూకంపం : ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

తుర్కియే తీర పట్టణాన్ని 5.8 తీవ్రతతో కూడిన భూకంపం మంగళవారం కుదిపేసింది. దాంతో ప్రజల్లో భయాందోళన నెలకొందని అధికారులు తెలిపారు. చాలా మంది కిటికీల నుంచి లేక బాల్కనీల నుంచి దూకి ప్రాణాలను కాపుడుకునే ప్రయత్నంలో గాయపడ్డారు. కాగా ఓ 14 ఏళ్ల బాలికను హాస్పిటల్‌కు తీసుకుపోగా అక్కడ చనిపోయింది. దీనికి మించి పెద్ద నష్టం జరిగిన సమాచారం ఏమి లేదు. మధ్యదరా సముద్రంలో రాత్రి 2.17 గంటలకు ఈ భూకంపం వచ్చిందని వార్త. గ్రీకు ద్వీపం రోడ్స్‌లో కూడా దీని ప్రభావం కనిపించింది.

తుర్కియేలో 2023లో 7.8 తీవ్రతతో కూడిన భూకంపం రాగా నాడు 53వేల మంది చనిపోయారన్నది గమనార్హం. ఇదిలావుండగా పాకిస్థాన్‌లో కూడా భూకంపం వార్తలు భయాందోళనలు రేకెత్తించగా కరాచీలోని మలిర్ జైలు నుంచి 200కు పైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. అయితే పోలీసులు వారిని తిరిగి పట్టుకుని కారాగారం గదుల్లోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లంఝర్ మంగళవారం ధ్రువీకరించారు. మలిర్ జైలులో 100కు పైగా భారతీయ ఖైదీలు కూడా ఉన్నారన్నది గమనార్హం. వారిలో ఎక్కువ వరకు చేపలు పట్టేవారే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News