Sunday, June 29, 2025

లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కేసు.. ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: సౌత్ కలకత్తా లా కాలేజీలో ఓ విద్యార్థినిపై జూన్ 25 సాయంత్రం జరిగిన సామూహిక అత్యాచార సంఘటనపై దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. వివరాల ప్రకారం, ఈ ఘటనపై ప్రత్యేక నిఘా విభాగం (SSD)కి చెందిన ACP ప్రదీప్ కుమార్ ఘోసల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులు మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ్‌లను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. దర్యాప్తు జరుగుతున్నందున ముగ్గురినీ జూలై 1 వరకు పోలీసు కస్టడీకి తరలించారు. శనివారం ఉదయం కోల్‌కతా లా కాలేజీకి చెందిన సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అరెస్టు చేశారు. విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్న గార్డును తరువాత అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

కాగా, పరీక్షల సంబంధిత ఫారమ్ దాఖలు చేయడానికి బుధవారం మధ్యాహ్నం దక్షిణ కోల్‌కతాలో కస్బాలోని తన కాలేజీకి వచ్చిన 24 ఏళ్ల విద్యార్థినిని సెక్యూరిటీ గార్డు గదిలోకి తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.దుండగుల్లో ఇద్దరు సీనియర్ విద్యార్థులు కాగా, మరొక వ్యక్తి అధికార పార్టీ టిఎంసి విద్యార్థి విభాగం నేతగా గుర్తించారు. నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం కస్టడీకి అప్పగించింది. ఆర్‌జి కర్ ఆస్పత్రి ఘటన మరిచిపోకముందే పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం జరగడంతో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News