- Advertisement -
గోదావరిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం గోదావరిలో పుణ్యస్నానాల కోసం బాసరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు.. పుణ్యస్నానాలకు రాగా, వారిలో ఐదుగురు నీటిలో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్లోని చింతల్కు చెందిన రాకేశ్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -