- Advertisement -
కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంబటిపల్లి వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో కొందరు యువకులు గోదావరిలో స్నానానికి వెళ్లారు. అయితే, ప్రమాదవశాత్తు నీళ్లల్లో చిక్కుకుని ఆరుగురు యువకులు గల్లంతు కాగా.. మరో ఇద్దరు యువకులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత యువకులను అంబటిపల్లికి చెందిన నలుగురు, కొర్లకుంటకు చెందిన ఇద్దరు యువకులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలయాల్సి ఉంది.
- Advertisement -