- Advertisement -
గత ఏడాది తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన 70 ఏళ్ల వృద్ధునికి కేంద్రపర జిల్లా స్థానిక కోర్టు 20 ఏళ్ల పాటు జైలుశిక్ష విధించింది. దీంతోపాటు దోషి బాతకృష్ణ సాహూకు రూ.50 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించకుంటే మరో ఏడాది జైలు శిక్షఅనుభవించవలసి వస్తుందని కేంద్రపర అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి , స్పెషల్ జడ్జి తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలికి రూ. 6 లక్షలు నష్టపరిహారంగా అందజేయాలని ఒడిశా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించిందని ప్రాసిక్యూషన్ న్యాయవాది మనోజ్కుమార్ సాహు చెప్పారు. పట్టముండై పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామ పాఠశాలలో బాదితురాలు మూడో తరగతి చదువుతోంది
.
- Advertisement -