Sunday, September 14, 2025

7,441 బి.ఇడి సీట్లు భర్తీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) సీట్ల భర్తీకి నిర్వహించిన రెండో విడత టిజి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌లో 7,441 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ మేరకు ఆదివారం టిజి సెట్స్ కన్వీనర్ పాండురంగారెడ్డి సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడించారు.రెండో విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో మొత్తం 10,005 బి.ఇడి సీట్లు అందుబాటులో ఉండగా, 12,076 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 9,955 సీట్లు కేటాయించగా, 4,474 మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 18 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అన్నారు. రిపోర్టింగ్ సమయంలోనే ఆయా కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పాండురంగారెడ్డి పేర్కొన్నారు.

Also Read: ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News