Wednesday, June 18, 2025

యుపి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

8 Killed in Fire at Chemical Factory in UPs Hapur

హాపూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో శనివారం ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలి 8 మంది కార్మికులు మరణించారు. ధోలానా ప్రాంతంలో ఉన్న రసాయనిక ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలుడులో 15 మంది కార్మికులు గాయపడినుట్ల అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు. కాగా..ఈ సంఘటనలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సహాయం అందచేసి బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు కొనసాగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News