- Advertisement -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ సరిహదుల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. గురువారం బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న మరణించినట్లు సమాచారం. చంద్రన్న సహా మొత్తం 8మంది నక్సల్స్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. గతంలో చంద్రన్నపై రూ.కోటి రివార్డు ఉంది. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.
- Advertisement -