Friday, June 13, 2025

తిరుపతి-కరీంనగర్ మధ్య 8 ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

ప్రయాణీకుల రద్దీ దృష్టా దక్షిణ మధ్య రైల్వే తిరుపతి, కరీంనగర్ మధ్య 8 వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపనుంది. జులై 6 నుండి 27వ తేదీ వరకు తిరుపతి-కరీంనగర్ (02761) ప్రత్యేక రైళ్లు ప్రతి ఆది వారం, జులై 7 నుండి 28 వరకు కరీంనగర్‌-తిరుపతి (02762) ప్రత్యేక రైళ్లు ప్రతి సోమవారం నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడుర్, నెల్లూర్, ఓంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి స్టేషన్‌లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.

బెంగళూరు, బీదర్ మధ్య 10 ప్రత్యేక రైళ్లు
ప్రయాణీకుల రద్దీ దృష్టా దక్షిణ మధ్య రైల్వే ఎస్‌ఎంవిటి బెంగళూరు, బీదర్ మధ్య 10 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది. జూన్ 15 నుండి 29 వరకు ఎస్‌ఎంవిటి బెంగళూరు బీదర్ (06539) ప్రత్యేక రైలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో, ఈ నెల 16 నుండి 30 వరకు బీదర్‌-ఎస్‌ఎంవిటి బెంగళూరు (06540) ప్రత్యేక రైలు ప్రతి శని, సోమవారాల్లో నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్‌ఓ ఎ. శ్రీధర్ తెలిపారు. ఈ రైళ్లు యెలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయిచూర్, క్రిష్ణ, యాద్గిర్, వాడి, షాబాద్, కలబుర్గి, హొమ్మాబాద్ స్టేషన్‌లలో ఆగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News