లండన్కు వెళ్తుండగా దుర్ఘటన అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని
మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన విమానం ప్రమాద సమయంలో ఫ్లైట్లో
230మంది ప్రయాణికులు ఇద్దరు పైలెట్లు, 10మంది సిబ్బంది ప్రమాదంలో
ఒక్కరు మినహా అందరూ దుర్మరణం మృతులలో 168మంది భారతీయులు,
53మంది బ్రిటన్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్, ఒకరు కెనడా వాసి
ఒక్కొక్క మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన
టాటా గ్రూప్ క్షతగాత్రుల చికిత్స ఖర్చులు భరించడానికి సంసిద్ధత సాంకేతిక
లోపంతో పైకి ఎగరలేకపోయిన విమానం లిఫ్ట్ ఆఫ్ ఫెయిల్యూర్తో ప్రమాదం జరిగి
ఉంటుందని నిపుణుల అభిప్రాయం నిర్వహణ సరిగ్గా లేక సమస్యలు వచ్చినట్లు
సందేహాలు ఏడాదిలో ఈ విమానానికి రెండుసార్లు సాంకేతిక సమస్యలు
డిజిసిఎ హెచ్చరిక లేఖను పట్టించుకోని ఎయిర్ ఇండియా డిఎన్ఎ పరీక్షల
అనంతరమే మృతుల వివరాల వెల్లడి : అమిత్షా విమాన ప్రమాదంపై రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, సిఎం రేవంత్ దిగ్భ్రాంతి ఘటన స్థలిని
సందర్శించిన కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు నేడు అహ్మదాబాద్కు ప్రధాని
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఘో ర విమాన ప్రమాదం సంభవించింది. 241 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం చెందారు. గురువారం సర్దా ర్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుం చి మధ్యాహ్నం 1. 39 గంటలకు లండన్కు బయలుదేరిన వెంటనే ఎయిరిండియా బోయింగ్ 787 విమానం డ్రీమ్ లైనర్ నగరంలోని నివాసిత ప్రాంతంలో కున్పకూలింది. ప్ర మాద స్థలి నుంచి ఇప్పటివరకూ 204 బృతదేహాలను వెలికితీశారు. లోపల ఏమి జరిగిందో తెలియదు కానీ పైలట్ విమానంలో నుంచి విపత్కర పరిస్థితికి సంకేతం అయిన మేడే కాల్ను స్థానిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు రూంకు పంపించారు. అత్యవసర సందేశం తెలియచేసిన కొద్ది నిమిషాలకే విమానం కుప్పకూలింది. దీనితో అహ్మదాబాద్ స హా దేశవ్యాప్తంగా తీవ్ర కలవరం చెలరేగింది.
విమాన పత న ఘటన గురించి వెంటనే విమానాశ్రయ ట్రాఫిక్ నియంత్రణ విభాగం ప్రకటన వెలువరించింది. 230మంది ప్ర యాణికులలో 169మంది భారతీయులు, కాగా 53 మం ది బ్రిటిషర్లు, ఏడుగురు పోర్చుగిస్ వారు, ఒక్కరు కెనడియ న్ ఉన్నారు. ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విధులను నిర్వహించే 12మంది సిబ్బంది కూడా ఈ గగనతల దుర్ఘటనలో అకాల మరణం చెందారు. మరుక్షణమే విమానం కూలిందని వార్తలు నిర్థారించాయి. విమానం అదుపు తప్పుతూ , క్రమేపీ గిరికీలు కొడుతూ క్షణాలలో అగ్ని గోళంగా మారి కుప్పకూలుతున్న దృశ్యాలను స్థానికుడు ఒక్కడు సెల్ఫోన్ ద్వారా వీడియో చిత్రంగా తీశాడు. ఈ విమానం రెండు ఇంజిన్లతో ఉంది. విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు బయలుదేరిందని అ ధికారులు తెలిపారు. విమానం ప్రజలు నివసించే ప్రాం తంలో కూలడంతో అక్కడి వారు ఎవరైనా చనిపోయ్యారా? గాయపడ్డారా? అనేది నిర్థారణ కావల్సి ఉంది. శిథిలాల కింద ఎవరైనా ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విమానం లండన్లోని గాత్విక్ ఎయిర్పోర్టుకు బయలుదేరింది.
మెడికల్ కాలేజీ భవనాలపై కూలిన విమానం
విమానం అదుపు తప్పి, కక్షను వీడి నేలవైపు దూసుకువెళ్లుతూ కింద ఉన్న బిజె మెడికల్ కాలేజీ హాస్టల్పై పడింది. దీని సమీపంలోనే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది క్వార్టర్ల సముదాదాయాలు ఉన్నాయి. మండుతున్న విమానం కూలిన సమయంలో క్వార్టర్లలో ఎందరు ఉన్నారనేది వెల్లడికాలేదు. పరిసరాల్లోని కాలనీల్లో భయానక వాతావరణం ఏర్పడింది. ఈ క్వార్టర్లు విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఉన్నాయి. విమానం కూలిన ప్రాంతం లో ఎటుచూసిన శిథిలాలు, మండుతున్న వస్తువులు మధ్య కాలిపోయి ఉన్న మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయని, వీటిని వెలికితీసేందుకు సహాయక బృందాలు రం గంలోకి దిగాయని అధికారులు మ ధ్యాహ్నం తెలిపారు. క్వార్టర్లలోనివారు కొందరు గాయపడినట్లు వెల్లడైంది. వీరిని వెలికి తీసి ఆసుపత్రికి తరలించా రు. 2020లో ఎయిరిండియాకే చెంది న ఎక్స్ప్రెస్ ఫ్లైయిట్ దుర్ఘటన తరువా త జరిగిన భారీ విమాన ప్రమాదం ఇ దే. అప్పుడు విమానం కేరళలోని కోజికోడ్లో తడి రన్వైపై అదుపు తప్పింది. తరువాత రెండు ముక్కలు అయింది.
ఈ ఘటనలో 241 మంది మృతి చెందారు. విమానం కూలుతున్న దశలో దట్టమైన నల్లటి పొగలు ఆకాశంలో అలుముకున్నాయి. ఈ ప్రాంతంలోని ఒక బహుళ అంతస్తుల భవనానికి మంటలు అంటుకున్నాయి. అక్కడి చెట్లు తగులబడ్డాయి. ప్రమాదానికి గురైన విమాన పైలట్ క్యాప్టెన్ సుమీత్ సబర్వాల్ అని, సహాయకుడు క్లైవ్ కుందర్ అని వెల్లడైంది. సుమీత్కు 8200 గంటల అనుభవం, కో పైలట్కు 1100 గంటల అనుభవం ఉందని అధికారులు తెలిపారు. విమానం 23వ రన్వే నుంచి బయలుదేరిన వెంటనే విమానాశ్రయం పరిధిలోనే కూలిందని వెల్లడైంది. రన్వే నుంచి బయలుదేరి కేవలం 600 నుంచి 800 మీటర్ల ఎత్తు కు వెళ్లిన దశలోనే ప్రమాదానికి గురైంది. విమానం అతి తక్కువ ఎత్తు నుంచి వెళ్లింది. డాక్టర్లు, నర్సుల క్వార్డర్లో ప లు అయిదంతస్తుల భవనాలు ఉన్నాయి. అపార్ట్మెంట్లలో ని పలువురు గాయపడ్డారని నిర్థారించారు. ఆవరణలోని ప లు కార్లు ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అతి తక్కువ ఎత్తు నుంచి ఎగురుతున్న దశలోనే కుప్పకూలిన ఘటనకు కారణం ఏమై ఉంటుందనేది ఇప్పుడు అం తుతెలియని విషయం అయింది. బ్లాక్బాక్స్ లభ్యం తరువాత ప్రమాద కారణాలు వెలికివచ్చే అవకాశం ఉంది.
హాస్టల్ ప్రాంగణంలో 25మంది బలి
మధ్యాహ్నం ఎయిర్పోర్టుకు సమీపంలోని బిజె మెడికల్ కాలేజీ (బిజెఎంసి) హాస్టల్లో విద్యార్థు లు భోజనాలు చేస్తున్నారు. ఈలోగానే విమానం వీరి హాస్టల్ క్యాంటిన్ వైపు దూ సుకువచ్చింది. భీకరమైన శబ్ధం తరువా త క్షణాల్లోనే విమానం మీదపడటంతో విద్యార్థులలో దాదాపు పాతిక మంది మంటలు అంటుకుని మృతి చెం దారు. కాలిన మృతదేహాలతో విషాదకర వాతావరణం నెలకొంది. విద్యార్థులలో నలుగురు ఎంబిబిఎస్ చేస్తున్నారు. మ రొకరు పిజి విద్యార్థి ఉన్నారు. హాస్టల్ క్యాంటిన్లో ప్లేట్లు, గ్లాసులు చెల్లాచెదురై రణరంగంగా మారింది. విమానంలోని ఓ శక లం హాస్టల్లో ఓ భాగంలో పడి ఉంది. ఈ ఘటనపై ఫైమా డాక్టర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు మృతి చెందా రు. పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని ఎప్పటికప్పు డు సమీక్షిస్తున్నామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎటువంటి సాయం చేయడానికి అయినా సిద్ధం అ ని ప్రకటించారు.
ఘటనలో 40 మంది వర కూ డాక్టర్లు గాయపడ్డారు. ఒక్క డాక్టరు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స మయంలో తన కుమారుడు హాస్టల్ క్యాంటిన్లో ఉన్నాడని, విమానం కూలుతున్నది గుర్తించి వెంటనే రెండో అంతస్తు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడని విద్యార్థి తల్లి రా మ్లీలా తెలిపారు. విమా నం దూసుకువస్తున్న వైనం సకాలంలో గుర్తించి చాలా మంది పరుగులు తీయడం, కిందికి దూకడంతో వారి ప్రా ణాలు దక్కాయని ఆమె వివరించారు. తన కుమారుడు ఇప్పుడు క్షేమంగా ఉన్నాడని చెప్పింది. ఆయనతో తాను ఫోన్లో మాట్లాడానని వివరించారు. రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయాలు అయ్యాయని వివరించారు. కాగా ఘటనలో 30 నుంచి 40 మంది వరకూ జూనియర్ డాక్టర్లు గా యపడ్డారు. వీరిలో ఒక్కరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షి అయిన డాక్టర్ శ్యామ్ గోవింద్ వార్తా సంస్థలకు తెలిపారు.
మాజీ సిఎం నివాసం వద్ద విషాదం
విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో గుజరాత్ మాజీ సిఎం విజయ్రూపానీ కూడా ఉన్నట్లు నిర్థారణ అయింది. దీనితో స్థానికంగా ఉన్న రూపానీ ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో బిజెపి నేతలు, కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. విమాన ప్రయాణికుల జాబితాలో 12వ నెంబర్ ప్రయాణికుడిగా విజయ్ రమణికల్ రూపానీ పేరు ఉంది. మాజీ సిఎంగా ఆయనను గుర్తించారు. బిజినెస్ క్లాస్ కేటగిరికి వచ్చే జడ్ క్లాస్లో ఆయన బుక్ చేసుకున్నారని వెల్లడైంది.
ఘటనపై ఎఎఐబి దర్యాప్తు
ప్రమాదంపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఎఎఐబి) దర్యాప్తు చేపడుతుందని అధికారులు తెలిపారు. తక్షణమే సంస్థ డైరెక్టర్ జనరల్, దర్యాప్తు విభాగం సంచాలకులు అహ్మదాబాద్కు బయలుదేరారు. సమగ్ర దర్యాప్తునకు రంగం సిద్ధం అయింది.