Tuesday, May 7, 2024

మంత్రి ఎర్ర‌బెల్లి కలిసిన ఎస్ జిడిసి చైర్మ‌న్ దూదిమెట్ల బాల‌రాజు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర షీప్ అండ్‌ గోట్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్‌ చైర్మ‌న్‌ డాక్టర్ దూదిమెట్ల బాల‌రాజు యాద‌వ్‌ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని హైద‌రాబాద్‌లోని మంత్రుల నివాసంలో శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవ‌లే ఎస్ జిడిసి చైర్మ‌న్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన బాలరాజు మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. బాల‌రాజుకు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, ప‌ద‌వి ఇచ్చిన సిఎం కెసిఆర్ కి, ప్ర‌భుత్వానికి మంచిపేరు తెచ్చేలా ప‌ని చేయాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Dudimetla Balaraju meets Errabelli Dayakar Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News