Saturday, May 4, 2024

రాష్ట్రంలో కొత్తగా 2,447 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

2,447 new Covid cases in Telangana

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 80,138 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,447 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,11,656కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,112 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,060కు చేరింది. తాజాగా కరోనా నుంచి 2,295 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,85,399 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.31 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,197 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 10,732 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News