Sunday, May 19, 2024

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Report over 2.55 lakh new corona cases

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు గత రెండు రోజుల నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గత 24 గంటల్లో 18,75,533 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 2,55,874 మందికి కరోనా వైరస్ సోకినిట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనాతో మరో 614 మంది మృతి చెందగా, 2,67,753మంది కోలుకున్నారని తెలిపింది. నిన్నటితో పోలిస్తే 50,190 కేసులు తక్కువగా నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.92కోట్లకు చేరుకోగా, ఇప్పటివరకు దేశంలో 4.90లక్షల మందికి పైగా బాధితులు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 22,36,842 కరోనా పాజిటీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 15.52 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు దేశంలో 162కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.

India Report over 2.5 lakh new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News