Tuesday, April 30, 2024

దేశంలో కొత్తగా 2.8లక్షలకు పైగా పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports over 2.8 lakh fresh corona cases

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దీంతో గత 24 గంటల్లో కొత్తగా 2,85,914 మందికి కరోనా వైరస్ సోకినిట్లు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనాతో మరో 665 మంది మృతి చెందగా, 2,99,073మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.92కోట్లకు చేరుకోగా, ఇప్పటివరకు దేశంలో 4.90లక్షల మందికి పైగా బాధితులు చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 22,23,018 కరోనా పాజిటీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 15.52 శాతం నుంచి 16.16 శాతం చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో 163కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.

India Reports over 2.8 lakh fresh corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News