Wednesday, May 1, 2024

దేశంలో లక్షకు దిగువన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India's daily Covid cases drop below 1 lakh

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 83,876 కరోనా సోకింది. తాజాగా మరో 895 మంది వైరస్ తో చనిపోయారు. అదే సమయంలో 1,99,054 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. భారత్ లో ప్రస్తుతం 11,08,938 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు కోవిడ్ కారణంగా మరణించిన వారీ సంఖ్య 5,02,874కి చేరింది. దేశంలో రోజువారీ సానుకూలత రేటు7.25శాతానికి తగ్గింది. దేశంలో ఇప్పటివరకు 169.63 కోట్ల కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News