Tuesday, May 7, 2024

ముంబయిలో నైజీరియన్ నుంచి డ్రగ్స్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Drugs seized from Nigerian man in Mumbai

ముంబయి: ఒక నైజీరియా దేశస్థుడి నుంచి రూ. 30.20 లక్షలు విలువ చేసే మాదకద్రవ్యాలను యాంటీ నర్కోటిక్స్ సెల్ అధికారులు ముంబయిలోని అంధేరి వెస్ట్‌లో శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని బస్టాపు వద్ద శుక్రవారం సాయంత్రం ఆలివర్ దిబ నిక్కి(42) అనే నైజీరియన్ నుంచి 200 గ్రాములు మెఫెడ్రోన్, 34 గ్రాముల కొకైన్‌ను అధికారులు స్వాథీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టయిన నిక్కీ గత ఏడాది డిసెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడని, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నాడని అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News