Wednesday, September 17, 2025

దావోస్ లో సిఎం జగన్‌తో భేటీపై కెటిఆర్ ట్వీట్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: విదేశీ గడ్డ మీద అరుదైన కలయిక జరిగింది. దావోస్ వేదికగా ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. “నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది” అంటూ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. అయితే వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాల మీద చర్చించారనే దానిమీద స్పష్టత రావాల్సి ఉంది.

KTR Meet AP CM Jagan in Davos

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News