Monday, May 27, 2024

కొత్తగా 18,257 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

18257 new corona cases in India

న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,36,22,651 కు చేరాయి. ఇందులో 4,29,68,533 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,28,690 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 42 మంది కరోనాతో మృతిచెందారు. 14,553 మంది డిశ్చార్జీ అయ్యారు. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీరేటు 98.50 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నదని తెలిపింది. 12 లక్షల మంది టీకా తీసుకోగా, మొత్తం 198 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News