Monday, May 20, 2024

అమెరికాకు చైనా హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

 

Nancy Pelosy

బీజింగ్: హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తన ఆసియా పర్యటన సందర్భంగా తైవాన్‌ను సందర్శిస్తే అమెరికా “మూల్యం చెల్లించకతప్పదని” చైనా మంగళవారం హెచ్చరించింది.  రెండు అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి.
పెలోసి తైపీకి వెళ్లే అవకాశం ఉంది, ఇది 25 సంవత్సరాలలో ఎన్నుకోబడిన అమెరికా అధికారి ద్వారా అత్యధిక ప్రొఫైల్ సందర్శన కాబోతుంది. అయితే బీజింగ్ హెచ్చరికలు చేస్తోంది. “చైనా సార్వభౌమ భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసినందుకు అమెరికా బాధ్యత వహించక తప్పదు, మూల్యం చెల్లించకా తప్పదు” అని  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ బీజింగ్‌లో ఒక సాధారణ విలేకరుల సమావేశంలో అన్నారు.బీజింగ్ స్వయంపాలిత, ప్రజాస్వామ్య తైవాన్‌ను తన భూభాగంగా పరిగణిస్తుంది. అవసరమైతే బలవంతంగా ఒక రోజు ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News