Tuesday, April 30, 2024

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి:   బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ 2వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది.  పాదయాత్రలో భాగంగా బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు పాదయాత్ర కొనసాగనుంది. బస్వాపూర్ గ్రామంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో కలిసి బండి రచ్చబండ నిర్వహించనున్నారు. బస్వాపూర్ పాఠశాల విద్యార్థులతో బండి సంజయ్ ముచ్చటించారు. సంజయన్నతో మాట్లాడేందుకు, చేయికలిపేందుకు విద్యార్థులు ఉత్సాహం ప్రదర్శించారు.   అందరితో చేయి కలుపుతూ, పలకరిస్తూ, చిన్నారులను హృదయానికి హత్తుకుంటూ ముందుకు కదిలారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News