Sunday, May 5, 2024

సామ్‌సంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు

- Advertisement -
- Advertisement -

Samsung launches Galaxy Z series smartphones

హైదరాబాద్ : కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ అత్యాధునిక గెలాక్సీ జెడ్ సిరీస్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. 4వ తరం ఫోల్డబుల్స్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్4ల లాంచ్ చేసిన తర్వాత వీటి గురించి సామ్‌సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్ (ప్రొడక్ట్ మార్కెటింగ్) ఆదిత్య బబ్బర్ వివరించారు. ఇంకా గెలాక్సీ వాచ్ 5 స్మార్ట్ వాచ్, గెలాక్సీ బడ్స్ 2 ప్రొ వంటి ఉత్పత్తులను కూడా ఆవిష్కరించారు. అయితే మూడు రంగుల్లో లభించే స్మార్ట్‌ఫోన్లు ధరలను చూస్తే, గెలాక్సీ జెడ్ ఫోల్ 4 ఫోన్ 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.1,54,999గా ఉంది. ఇక 12జిబి+512జిబి వేరియంట్ రూ.1,64,999లో లభ్యమవుతుంది. ముందస్తు బుక్ చేసుకున్న వారు రూ.45,999 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News