Tuesday, April 30, 2024

దేశంలో కొత్తగా 11వేల కరోనా కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

India Reports 11539 new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,539 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 43మంది బాధితులు మృతిచెందినట్లు తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.43కోట్లకు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 5,27,332 మంది మరణించారు. గత 24 గంటల్లో 12,783 మంది బాధితులు డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 4,37,12,218 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 99,879 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 209.67 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Reports 11539 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News