Tuesday, April 30, 2024

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక

- Advertisement -
- Advertisement -

Dr. Pattipaka Mohan selected for Central Sahitya Akademi Award

మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన బాలసాహిత్య పురస్కారానికి బాల సాహితీవేత్త తెలంగాణకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక అయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2022 పురస్కారాలకు ఎంపికైన వారి పేర్లను కేంద్రం బుధవారం ప్రకటించింది. అందులో భాగంగా పత్తిపాక మోహన్ రాసిన బాలలతాత బాపూజీ గేయ కథకు ఈ పురస్కారం దక్కింది. ఈ ఏడాదిగాను 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులు, కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోహన్ సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రియ శిష్యుల్లో ఒకరైన డాక్టర్ పత్తిపాక మోహన్, బాలల్లో సాహిత్యంపై మక్కువ పెంచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం మన కవులు, బాలలతాత బాపూజీ, జో అచ్యుతానంద జోజో ముకుంద…, చందమామ రావే, ఒక్కేసి పువ్వేసి చందమామ వంటి అనేక రచనలు బాలల కోసం అందించారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సహాయ సంపాధకులుగా వివిధ భాషల్లోని కథలను తెలుగులోకి ఆయన అనువాదం చేశారు.

పల్లిపట్టు నాగరాజు.. యాలై పూడ్సింది

చిత్తూరు జిల్లా యాసలో కష్ట జీవులు, బడుగుల బతుకులపై ‘యాలై పూడ్సింది’ శీర్షికతో రచించిన కవితా సంపుటిని కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపిక చేసింది. 35 ఏళ్ల లోపు సాహిత్య వేత్తలకు కేంద్ర సాహిత్య యువ పురస్కారాలు ప్రకటిస్తారు. 2011లో ప్రారంభించిన ఈ పురస్కారం కింద 50వేల రూపాయల నగదుతోపాటు జ్ఞాపికలను బహూకరిస్తారు.పల్లిపట్టు నాగరాజు తెలుగు భాష ఉపాధ్యాయుడు. శాంతిపురం మండలం పెద్దూరు హైస్కూలులో పనిచేస్తున్న సమ-యంలో ఆయన ‘యాలై పూడ్సింది’ కవితా సంపుటిని రాసి ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు’ను కూడా అందుకున్నారు. తెలుగు భాషతో పాటు అస్సామీ, బెంగాలీ, బోడో, దోగ్రి, ఆంగ్లము (ఇంగ్లిష్), గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మైథిలీ, మళయాళం, మణిపురి, మరాఠీ, నేపాలి, ఒడియా, రాజస్థానీ, సంస్కృతం, సింధి, తమిళం, ఉర్దూ భాషల్లో ఉత్తమ రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా పురస్కారాలు అందిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News