Tuesday, April 30, 2024

అందుకు తెలంగాణ చరిత్రే ఉదాహరణ: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Public meeting in Kongara Kalan

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం కొంగరకలాన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పుడు ప్రచారం చేశారని సిఎం పేర్కొన్నారు. రంగారెడ్డిలో జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని అన్నారు. విద్యుత్, సాగునీరు, తాగునీరు ఇవ్వని వాళ్లే తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఏ ప్రాంతంలో మేధావులు, విద్యాధికులు ఏమరపాటుగా ఉంటారో అక్కడ చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందుకు తెలంగాణ చరిత్రే ఉదాహరణ. చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News